వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ, మిశ్రా అరెస్టుకు రంగం సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నాః బీహార్‌ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జగన్నాథమిశ్రాలను దాణా కుంభకోణం కేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సిబిఐ ప్రకటించింది.వీరిపై ప్రత్యేక కోర్టు నాన్‌ బెయలబుల్‌ వారెంట్లు జారీ కావడంతో లాలూ,మిశ్రాల అరెస్టుకు సిబిఐ సన్నాహాలు చేస్తున్నది. కోర్టు నుంచి ఆదేశాలుఅందిన వెంటనే బుధవారం ఉదయం వారిని అరెస్టు చేస్తామని సిబిఐ ప్రకటించింది. లాలూ,మిశ్రాలతో పాటు మరో 112 మందికి దాణా కుంభకోణం కేసులో వారెంట్లు జారీ అయ్యాయి.

లాలూపై అరెస్టు వారెంట్లు జారీ కావడంతో రాష్ట్రీయ జనతాదళ్‌ లో ఆందోళన ప్రారంభమైంది. లాలూ జైలుపాలైతే పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరు అనేఅంశంపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. లాలూ నివాసంలో పార్టీసీనియర్‌ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.

మరో కేసులో లాలూకు ఊరట
ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్న కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మూడు నెలల జైలు శిక్ష అమలును సుప్రీంకోర్టు మంగళవారం సస్పెండ్‌ చేసింది. ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్‌ లాలూకు విధించిన మూడు నెలల కఠిన కారాగార శిక్షను అమలు చేయరాదని స్పష్టం చేసింది. లాలూపై పశుగ్రాసం కేసులో నాన్‌ బెయలబుల్‌అరెస్టు వారెంట్లు జారీ అయిన రోజునే మరో కేసులో ఆయనపై శిక్ష అమలును సస్పెండ్‌ చేయడంవిశేషం.
జయ ప్రభంజనాన్ని డిఎంకె అడ్డుకోగలదా? ప్రతిసారీవిలక్షణమైన తీర్పు ఇచ్చే తమిళ ఓటర్లు ఈ సారి ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో పదోతేదీ జరిగే ఎన్నికల్లో మాత్రమే తేలుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X