వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్నికల తర్వాతే పాంజాపై వేటు
కోల్కతా: తిరుగుబాటు బావుటా ఎగురవేసి, బీజేపీ సరసన చేరిన సీనియర్ నేత అజిత్ పాంజాపై చర్య తీసుకునే విషయంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ఆచితూచి వ్యవహారించాలని నిర్ణయించింది. ఎన్నికల సంగ్రామం మధ్యలో అజిత్ పాంజాపై చర్య తీసుకున్న పక్షంలో హఠాత్తుగా ఆయన హీరో అయ్యే అవకాశం వున్నదని అందువల్ల ఆయన్ను పట్టించుకోకుండా వుండటమే మంచిదని తృణమూల్ నేత మమతాబెనర్జీ భావిస్తున్నట్టుగా తెలిసింది.
మమతాబెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించిన అజిత్పాంజా ఈ ఎన్నికల్లో, బిజేపీ అభ్యర్ధుల పక్షాన ప్రధాని వాజ్పేయితో కలసి ప్రచారం కూడా చేశారు. మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. పాంజాపై చర్యకుపార్టీ శ్రేణులనుంచి వచ్చినప్పటికీ ఎన్నికల తర్వాతనే ఆయన వ్యవహారం తేల్చాలని మమత నిర్ణయించుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పాయి.
Story first published: Tuesday, May 8, 2001, 23:53 [IST]