చిరు,నాగ్ హామీతో దీక్షవిరమించిన ప్రకాష్ రాజ్
హైదరాబాద్ః ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు సినీ రంగంలో సంచనలం సృష్టించిన ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ తన దీక్షను విరమించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి, మా ప్రస్తుత అధ్యక్షుడు అక్కినేని నాగార్జున ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించినట్లు ప్రకాష్ రాజ్ మంగళవారం ప్రకటించారు.
సోమవారం ప్రకాష్ రాజ్ దీక్ష ప్రారంభించగానే చిరంజీవి, నాగార్జున ఆయనను పరామర్శించారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలో మా సమావేశం ఏర్పాటు చేసి మీకు న్యాయం చేస్తామని చిరంజీవి, నాగార్జున తనకు హామీ ఇచ్చారని ప్రకాష్ రాజ్ చెప్పారు. తెలుగు సినీరంగం తన సొంత కుటుంబం వంటిదని, దీక్ష కొనసాగించి అనవసర అపోహలకు అవకాశం ఇవ్వడం సమంజసం కాదని భావించినట్లు ప్రకాష్ రాజ్ వివరించారు.
విదేశీ
పర్యటనకు
వెళుతున్న
మా
ప్రస్తుత
అధ్యక్షుడు
నాగార్జున
తిరిగి
వచ్చిన
వెంటనే
సమావేశం
ఏర్పాటు
చేసి
ప్రకాష్
రాజ్
పై
విధించిన
నిషేధాన్ని
ఎత్తి
వేస్తారని
భావిస్తున్నారు.
ఈ
నెల
16వ
తేదీ
నాటికి
ప్రకాష్
రాజ్
పై
నిషేధం
ఎత్తివేసే
అవకాశాలున్నాయని
సినీ
వర్గాలు
చెబుతున్నాయి.
-
ప్రకాష్రాజ్
ఆమరణ
నిరాహార
దీక్ష