అనితాసేన్ కు బెయిలు నిరాకరణ
హైదరాబాద్ః ఆడశిశువుల అమ్మకాల కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న ఐ.పి.ఎస్. అధికారి సతీమణి అనితాసేన్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఆమె నిందితురాలిగా సాక్ష్యాధారులు వున్నందున ఆమెకు బెయిలు ఇచ్చే అవకాశం లేదని మెట్రొపాలిటన్సెషన్స్ న్యాయమూర్తి కె.సి. భాను స్పష్టం చేశారు.
రిక్రూట్ మెంట్ విభాగంలో అడిషనల్ డి.జి.గా వున్నస్వరణ్ జిత్ సింగ్ సతీ మణి అయిన అనితా సేన్ ఆడశిశువుల అమ్మకాల బండారం బట్టబయలయిన నాటి నుంచి పరారీలో వున్నారు.అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు అనితా సేన్ బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ నువిచారించిన న్యాయమూర్తి ఆమెకు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు.
రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ ఈ దత్తత సంస్థలపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఇంత వరకు అనితాసేన్ ను పోలీసులు అరెస్టు చేయలేకపోవడంవిశేషం. ఆమె ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్టు చేస్తామని సిఐడి డి.జి బాసిత్ చెప్పారు. అయితే పోలీసు అధికారి భార్యఅయిన అనితకు పోలీసుల శాఖలో బడా బాబుల అండ వున్నందనే ఆమెఅరెస్టు జాప్యం అవుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రమాతకు
గర్భశోకం
ఆడ
శిశువుల
విక్రయం...