అరుణాచల్ మంత్రి దుర్మరణం
న్యూఢిల్లీ: మంగళవారం నాడు గల్లంతయిన హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి దేరానటుంగ్ మరో ఆరుగురు అధికారులు దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది. మంగళవారం ఉదయం ఇటావా నుంచి మంత్రి బృందంతో బయలుదేరిన హెలికాప్టర్ కొద్ది క్షణాల్లో గల్లంతయింది. వైమానికదళం సిబ్బంది జరిపిన గాలింపులో హెలికాప్టర్ శకలాలు కామెంగ్ జిల్లాలో కనిపించాయి.
అదే
ప్రాంతంలో
గుర్తుపట్టడానికి
వీలులేకుండా
మారిన
మృతదేహాలు
కూడా
పడివున్నాయి.
అయితే
ఈ
మృతదేహాలను
ఇంకా
గుర్తించాల్సివుంది.
మంత్రితో
పాటు
హెలికాప్టర్లో
కేంద్ర
మానవవనరుల
శాఖ
కార్యదర్శి
ఎస్కె
జైన్,
రాష్ట్ర
విద్యాశాఖ
కార్యదర్శి
సాంగె
హడెన్,
టైమ్స్
ఆఫ్
ఇండియా
గ్రూప్
డిప్యూటి
ఎండి
నందిత
జడ్జ్,
సంఘసేవకులు
నిత్యానంద
త్రిహాన్
వున్నారు.
వీరుకాకుండా
కాప్టెన్
వికె
ధీర్,
కాప్టెన్
ఆర్పి
సింగ్
పైలెట్లుగా
వున్నారు.