ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుడు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని, ప్రధాని కార్యాలయం సమీపంలో, ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు బాంబుపేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో ఒకరు గాయపడ్డారు. అత్యంత కీలకమైన ఈ స్థలాల్లో పేలుడు సంభవించడంతో ఢిల్లీ పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.పేలుళ్లకు బాధ్యుడుగా భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులుఅరెస్టు చేశారు.
ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని క్యాంటిన్ సమీపంలోని పార్కింగ్ స్ధలం వద్ద మధ్యాహ్నం 3గంటల 7 నిముషాలకు మెదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబును దుండగులు ఓసైకిల్కు అమర్చారు. కొద్ది సేపు అనంతరం ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్కు 50మీటర్ల దూరంలోని ఓ చెత్త కుండీలో అమర్చిన మరో బాంబుపేలింది.
ఈ బాంబులు ముడి పేలుడు పదార్ధాలతో తయారు చేసినవని న్యూఢిల్లీ రేంజ్ పోలీసు సంయుక్త కమీషనర్సురేష్ రాయ్ తెలిపారు. ఈ రెండు పేలుళ్లకూ దుండగులుఒకే రకమైన బ్యాటరీలను ఉపయోగించినట్టు ఆయనపేర్కొన్నారు. పేలుళ్లలో గాయపడ్డ ఆర్పి సూద్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ
లోని
రెండు
సినిమా
ధియేటర్లలో
కూడా
బాంబులు
వున్నట్లు
ఫోన్
కాల్స్
రావడంతో
పోలీసులు
పరుగులు
తీశారు.
భద్రత
కట్టుదిట్టం
చేశారు.
బాంబుపేలుళ్ళతో
ఢిల్లీ
నగరం
ఒక్కసారి
ఉలిక్కిపడింది.
ఎర్ర
కోటలో
ఇటీవల
జరిగిన
కాల్పులు,
ఢిల్లీలోనివివిఐపిలు
వుండే
ప్రాంతాలపై
లష్కర్-ఎ-తోయిబా
కన్ను
వేసిందనే
సమాచారంతో
కొద్ది
రోజులుగా
భద్రతా
ఏర్పాటు
కట్టుదిట్టం
చేశారు.