వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ నక్సల్స్‌ చేతిలోవ్యాపారి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డబ్బు వివాదంలోమాజీ నక్సల్స్‌ ముఠా మంగళవారం సాయంత్రం ఒకరియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని దారుణంగా హత్యచేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ప్రతాప రెడ్డినిసికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై తల్వార్లతో నరికిచంపారు. ఈ దాడిలో హతుడి బావమరిది తీవ్రంగాగాయపడ్డాడు. మరో వ్యక్తి చేయి తెగింది.

వరంగల్‌ జిల్లా జనగాంకుచెందిన ప్రతాప్‌ రెడ్డి తన భార్య జ్యోత్స్న,ఇద్దరు కుమారులతో వలస వచ్చి ఆల్వాల్‌ స్థిరపడ్డాడు.జనగాంలో నక్సల్స్‌ బెదిరింపులు ఎక్కువ కావడంతో ఈ కుటుంబంఇక్కడికి వచ్చింది.

మంగళవారం సాయంత్రం ఇండికాకారులో బావ మరిది తిరుమల్‌ రెడ్డి, స్నేహితుడుశ్రీనివాస్‌, మరో ముగ్గురితో కలిసి ప్రతాప్‌ రెడ్డిసికింద్రాబాద్‌లోని తాజ్‌ బెల్సన్‌ హోటల్‌కు వచ్చాడు. ఆ తర్వాతకొద్ది సేపటికి బయటకు వచ్చి ప్రతాప్‌ రెడ్డి కారుఎక్కబోతుండగా దాదాపు ఇరవై మంది దుండగులుతల్వార్లతో దాడికి దిగారు. వారిని చూడగానేప్రతాప్‌ రెడ్డి పరుగు ప్రారంభించాడు. అతనితో పాటు తిరుమల్‌ రెడ్డి,శ్రీనివాస్‌ కూడా పరుగులు తీశారు. వారిని వెంటాడిహోటల్‌కు అరకిలోమీటరు దూరంలో ఆటో ట్రాలీ అడ్డు రావడంతోప్రతాప్‌ రెడ్డి ఆగిపోయాడు. అతనిపై దుండగులుమూకుమ్మడిగా దాడి చేసి తల్వార్లతో మెడనరికి హత్య చేశారు. దాడిని అడ్డుకోవడానికిప్రయత్నించిన తిరుమల్‌ రెడ్డిని, శ్రీనివాస్‌ను కూడానరికారు.

కత్తుల సమ్మయ్య అనుచరుడేపథకం ప్రకారం తన భర్తను హత్య చేయించాడనిప్రతాప్‌ రెడ్డి భార్య జ్యోత్స్న ఆరోపించింది. తన భర్త హత్యకు కత్తులసమ్మయ్య అనుచరుడు మాజీ నక్సలైట్‌ నర్సింహారెడ్డిపథకం రూపొందించినట్లు ఆమె ఆరోపించింది. ఎఎస్‌రావునగర్‌లో నివాసం వుంటున్న వేణు, చందు, వికాస్‌,ప్రసాద్‌, అనిల్‌ తదితరులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమెఅన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X