వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని, ప్రధాని కార్యాలయం సమీపంలో, ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు బాంబుపేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు బాధ్యుడుగా భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులుఅరెస్టు చేశారు.

ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని క్యాంటిన్‌ సమీపంలోని పార్కింగ్‌ స్ధలం వద్ద మధ్యాహ్నం 3గంటల 7 నిముషాలకు మెదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబును దుండగులు ఓసైకిల్‌కు అమర్చారు. కొద్ది సేపు అనతరం ప్రధాని కార్యాలయం సౌత్‌ బ్లాక్‌కు 50మీటర్ల దూరంలోని ఓ చెత్త కుండీలో అమర్చిన మరో బాంబుపేలింది.

ఈ బాంబులు ముడి పేలుడు పదార్ధాలతో తయారు చేసినవని న్యూఢిల్లీ రేంజ్‌ పోలీసు సంయుక్త కమీషనర్‌సురేష్‌ రాయ్‌ తెలిపారు. ఈ రెండు పేలుళ్లకూ దుండగులుఒకే రకమైన బ్యాటరీలను ఉపయోగించినట్టు ఆయనపేర్కొన్నారు. పేలుళ్లలో గాయపడ్డ ఆర్‌పి సూద్‌ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X