వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింహగర్జనను ఆపలేరుః చంద్రశేఖర్
హైదరాబాద్ః కరీంనగర్ లో ఈ నెల 17 జరుప తలపెట్టిన తెలంగాణా సింహగర్జనను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తెలంగాణా రాష్ట్రసమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు హెచ్చరించారు.
కరీంనగర్ లో సింహగర్జన కోసం ఎంపిక చేసుకున్న కళాశాల ప్రిన్స్ పాల్ ను అనుమతి ఇవ్వరాదంటూ బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. 17 తెలంగాణా ప్రజలు పెద్ద సంఖ్యలో కరీంనగర్ తరలి రానున్నారని, వారిని అడ్డుకోరాదని ఆయన కోరారు.
తెలంగాణా పై కాంగ్రెస్, బిజెపి మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణా పై అది చేస్తాం ఇది చేస్తాం అంటున్న ఆ పార్టీ నేతల్లో చిత్త శుద్ధి లేదని, నిజంగా వారికి తెలంగాణా ఉద్యమంపై చిత్తశుద్ధ వుంటే ఆ పార్టీలు, పదవులను అంటి పెట్టుకొని ఎందుకు వున్నారని ఆయన ప్రశ్నించారు.
Comments
Story first published: Wednesday, May 9, 2001, 23:53 [IST]