బాబుతో కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేల వాగ్యుద్ధం
కరీంనగర్ః కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలు వాగ్యుద్ధానికి దిగారు. కరీంనగర్ లో బుధవారం ముఖ్యమంత్రి బహిరంగ సభ జరుగుతుండగా జీవన్ రెడ్డితో సహా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలు సభా వేదిక వద్దకు దూసుకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డు కున్నారు. అయితే ఏదో విధంగా వారు సిం.ఎం. సభ జరుగుతున్న వేదిక ఎక్కి ప్రజల ముందే చంద్రబాబు నాయుడితో వాగ్యుద్ధానికి దిగారు.
రైతులకు గిట్టుబాటు ధర విషయంలో వారు చంద్రబాబు నాయుడితో చాలా సేపు వాదించారు. కేంద్రంతో మాట్లాడి చేయగలిగిందంతా చేస్తున్నామని చంద్రబాబు వారితో చెప్పారు. అయినా కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలు సి.ఎం.తో వాదనకు దిగారు. జిల్లాలో మిల్లర్లది ఇష్టా రాజ్యంగా మారిందని, రైతులు నానాయాతనలు అనుభవిస్తున్నారని, ఇందుకు మీరేం సమాధానం చెబుతారని వారు సి.ఎం. ని నిలదీశారు.
సిఎం
తో
కాంగ్రెస్
ఎమ్మెల్ల్యేలు
వాగ్యుద్ధానికి
దిగడంతో
ప్రజలు
సంభ్రమాశ్చర్యాలకు
లోనయ్యారు.
ఎప్పుడూ
పూర్తి
భద్రతా
వలయంలో
వుండే
చంద్రబాబు
వద్దకు
అసలు
ప్రతిపక్షానికి
చెందిన
ఎమ్మెల్ల్యేలు
ఎలా
రాగలిగారనేదే
చర్చనీయాంశంగా
మారింది.