వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెయింట్‌కీట్స్‌ కేసులో విపి వాంగ్మూలం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:సెయింట్‌ కీట్స్‌ ఫోర్జరీ కేసులో మాజీ ప్రధాని విపిసింగ్‌బుధవారం నాడు అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌, సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి ఆర్‌ ఎల్‌ చుగ్‌ ఎదుట తనవాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగావున్న చంద్రస్వామి, కైలాష్‌నాథ్‌ అగర్వాల్‌ అలియాస్‌మామాజీ కూడా ఆ సమయంలో కోర్టులోనే వున్నారు.విపిసింగ్‌ తన అర్ధాంగి సీతాదేవితో పాటు కోర్టు సమయంకంటే ముందుగానే న్యాయస్థానానికి వచ్చారు.

సెయింట్‌ కీట్స్‌దీవుల్లో తనకుమారుని పేరుతో అకౌంట్‌ తెరిచిలక్షలాది డాలర్లను విపిసింగ్‌ దాచుకున్నట్టుగాఆరోపణలు రావడం, ఈ ఆరోపణలపై జరిగిన దర్యాప్తులోవిపి ఆయన కుమారుడు అజయ్‌ల సంతకాలనుఫోర్జరీ చేసినట్టుగా వెల్లడయిన విషయం విదితమే.బుధవారం విచారణ ప్రారంభం కాగానే ముందుగాసిబిఐ తరఫు న్యాయవాది ఎన్‌కె శర్మ, ఫస్ట్‌ గ్లోబల్‌ట్రస్ట్‌కు చెందిన కొన్ని డాక్యుమెంట్లను చూపివాటిపై సంతకాలను పోల్చాల్సిందిగా కోరారు.

ఆ సంతకాలుతన కుమారుడు అజయ్‌వి ఎంతమాత్రం కాదనివిపి స్పష్టం చేశారు. ఆ తర్వాత విపిసింగ్‌నులబ్దిదారుగా పేర్కొన్న మరికొన్ని పత్రాలపై వున్నసంతకాలను గురించి ప్రశ్నించిగా తన సంతకాలుఫోర్జరీ చేసినట్టుగా విపి పేర్కొన్నారు. చంద్రస్వామితోపరిచయం గురించి డిఫెన్స్‌ న్యాయవాదులు అడిగినఅనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.గురువారం నాడు కూడా ఆయన కోర్టు ఎదుట హాజరవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X