దేశ రక్షణకుపెను ముప్పు
హైదరాబాద్: రక్షణ పరికరాల ఉత్పత్తుల రంగంలోకి ప్రైవేట్ సంస్ధలను అనుమతించడం దేశరక్షణకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని సిపిఐ నేత ఎబి బర్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన రక్షణ శాఖ ఉత్పత్తుల పరిశ్రమలో ప్రైవేట్ సంస్థలను అనుమతించాలన్న నిర్ణయాన్ని గురువారం నాడు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యతిరేకించారు.
ప్రైవేటీకరణ వల్ల ఆయుధాలు సంఘవిద్రోహుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం వున్నదని ఆయన పేర్కొన్నారు. నేరగాళ్లు, సంఘవిద్రోహులకు తేలిగ్గా ఆయుధాలు అందుబాటులోకి వస్తే అది దేశప్రయోజనాలను ధ్వంసం చేస్తుందని ఆయన హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వం దేశ భద్రతను, రక్షణను ప్రైవేట్ రంగానికి తాకట్టుపెడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. ఆయుధ కర్మాగారాలను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
ప్రత్యేక
తెలంగాణకు
వ్యతిరేకం
ప్రత్యేక
తెలంగాణ
ఉద్యమానికి
తమ
పార్టీ
వ్యతిరేకమని
సిపిఐ
ప్రధాన
కార్యదర్శి
బర్దన్
స్పష్టం
చేశారు.
తెలంగాణ
వెనకబడిన
తనానికి
పాలకుల
నిర్లక్ష్యమే
కారణమని
ఆయన
చెప్పారు.
ఏ
కారణం
చేతనైనా
రాష్ట్రాన్ని
విభజించడానికి
తమ
పార్టీ
వ్యతిరేకమని
ఆయన
వెల్లడించారు.