ప్రొద్దుటూరులో లాకప్డెత్
కడప : కడప జిల్లా ప్రొద్దుటూరు పట్ణంలోని టు టౌన్ పోలీసు స్టేషనులో గురువారం తెల్లవారు జామున వెన్నూతల భాస్కర్ (35) లాపక్ డెత్కు గురయ్యాడు.పోలీసు దెబ్బలకే భాస్కర్ మరణించాడని భావిస్తున్నారు.సైకిల్ దొంగతనాలతో సంబంధంవున్నదనేఅనుమానంతో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన భాస్కర్ను నాలుగురోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచీ పోలీసు స్టేషనులో ఉంచి విచారిస్తున్నారు.
బుధవారం రాత్రి కేసు విచారణ పేరుతో పోలీసులు భాస్కర్ను తీవ్రంగా కొట్టారు. అనంతరం లాకప్లో వేశారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో తనకు గెండెనొప్పిగాఉన్నదని స్టేషన్లో వున్న పోలీసులకు భాస్కర్ చెప్పినా వారు స్పందించలేదు. చెంబుడు నీళ్లుతాగి పడుకోమని భాస్కర్కు సలహా ఇచ్చారు.
నొప్పిఅధికమై భాస్కర్ మరణించాడు.తెల్లవారు జామున స్టేషన్ను శుభ్రం చేయటానికి వచ్చిన సిబ్బంది భాస్కర్ను లేపేందుకు ప్రయత్నించారు. ఎంతకూ లేవకపోయేసరికి పరిశీలించగా అతను మరణించిన విషయం కనుగొన్నారు. వెంటనే భాస్కర్ శవాన్ని పోలీసులు ప్రొద్దుటూరు ఆసుప్రతికి తరలించారు. భాస్కర్ మరణవార్త తెల్లవారే సరికల్లా పట్టణంలో గుప్పుమంది. లాకప్డెత్ను నిరశిస్తూ వివిధ ప్రజాసంఘాలు ఆందోళనకు పూనుకున్నాయి. ఫలితంగా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది.