వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవర్‌ కట్‌ కుస్వస్తి - సర్కార్‌ కుస్తీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఈ ఏడాది రెండున్నర లక్షల అక్రమవిద్యుత్‌ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రైతులకు 50వేల సాగునీటి కనెక్షన్లు మంజూరు చేయాలని కూడావిద్యుత్‌ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో నిర్ణయించారు.

జూన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాలలో 24 గంటల విద్యుత్‌ సరఫరాకు సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని సుబ్బారాయుడువిలేకరులకు వివరించారు. రైతులకు మరింత వెసులుబాటు కల్పించేందుకువీలగు 50 వేల విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. హైటెన్షన్‌విద్యుత్‌ కనెక్షన్లు కావాలనుకొనే రైతులు అందుకు అవసరమైనవిద్యుత్‌ పరికరాలు వారే సమకూర్చుకోవాల్సి వుంటుందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X