వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందూజా సోదరులకు మోక్షం
న్యూఢిల్లీః బోఫోర్సు కేసులోవిచారణ ఎదుర్కొంటున్న హిందూజా సోదరులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ముగ్గురు హిందూజా సోదరులలో ఇద్దరిని మాత్రం దేశం విడిచి వెళ్ళేందుకు సుప్రీంకోర్టు శనివారం అనుమతించింది. జస్టిస్ ఎం.బి.షా, జస్టిస్ వై.కె. సభార్వల్ సారధ్యంలోని ప్రత్యేక బెంచ్ ఇద్దరు హిందూజా సోదరులను దేశం విడిచి వెళ్ళేందుకు అనుమతిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది.
దేశం విడిచి వెళ్లే ముందు ఒకొక్కరూ 150 మిలియన్ డాలర్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. దేశం విడిచి వెళ్ళేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో హిందూజా సోదరులు ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు.ఈ తీర్పు తమ విచారణకు ఏ మాత్రం అవరోధం కాదని సిబిఐ అధికారులు చెప్పారు.
Comments
Story first published: Saturday, May 12, 2001, 23:53 [IST]