జాతీయ క్రీడలకు ముస్తాబు
హైదరాబాద్: వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జంటనగరాలు ఇందుకు అనుగుణంగా ముస్తాబవుతున్నాయి. ఈ క్రీడలకోసం చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లను రాష్ట్ర క్రీడల శాఖమంత్రి తమ్మినేని సీతారామ్ శనివారం నాడు పర్యవేక్షించారు. జాతీయ క్రీడలకోసం హైదరాబాద్లో కొత్తగా తొమ్మిది స్టేడియంలు రూపుదిద్దుకుంటున్నట్టుగా మంత్రి వెల్లడించారు.
క్రీడల నిర్వహణ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలమేర ఖర్చు చేస్తున్నది. గచ్చిబౌలిలో నిర్మిస్తున్న అత్యాధునిక ఇండోర్ గేమ్స్ స్టేడియంను, అథ్లెటిక్స్ స్టేడియంను మంత్రి సందర్శించారు. ఎనిమిదివేల మందికి ఏకకాలంలో వసతి కల్పించగల క్రీడాగ్రామం కూడా సిద్దమవుతున్నదని మంత్రి చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఏర్పాట్లన్నీ పూర్తికాగలవని ఆయన వెల్లడించారు.
ఉస్మానియా
విశ్వవిద్యాలయంలోని
సైక్లింగ్
స్టేడియంను
జాతీయ
క్రీడల
కోసం
ఆధునీకరిస్తున్నట్టుగా
ఆయన
వెల్లడించారు.
ఫతేమైదాన్
స్టేడియంలో
కూడా
మార్పు
చేర్పులు
జరుగుతున్నాయని
అన్నారు.
యూసఫ్గూడాలోని
పోలీస్లైన్స్లో
అత్యాధునికి
బాస్కెట్బాల్,
వాలీబాల్
స్టేడియం
నిర్మాణం
చురుగ్గా
సాగుతున్నదని
ఆయన
వెల్లడించారు.