తృణమూల్-సిపిఎం ఘర్షణలు
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు మినహా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శనివారం నాడు ప్రశాంతంగా సాగింది. బిష్ణుపూర్ తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల ఎదురుగానే ఘర్షణకు దిగిన తృణమూల్, సిపిఎం కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు.
రెండు
వర్గాలు
బాంబులు,
మారణాయుధాలతో
స్వైరవిహారం
చేస్తూ
ఓటర్లను
భయభ్రాంతులను
చేసినట్టుగా
అధికారులు
చెప్పారు.
టిటాఘర్
నియోజకవర్గంలో
మారణాయుధాలతో
అనుమానాస్పద
పరిస్థితుల్లో
కనిపించిన
ఎనిమిది
మంది
తృణమూల్
కార్యకర్తలను
పోలీసులు
అరెస్టు
చేశారు.
కాగా
అస్సాంలోని
కొన్ని
కేంద్రాల్లో,
తమిళనాడులో
రీపోలింగ్
ప్రశాంతంగా
జరిగిందని
అధికారులు
తెలిపారు.
ఇదిలా
వుండగా
అయిదు
రాష్ట్రాల
అసెంబ్లీలకు
జరిగిన
ఎన్నికల
ఓట్ల
లెక్కింపు
ఆదివారం
నుంచి
ప్రారంభమవుతుంది.
ఎలక్ట్రానిక్
ఓటింగ్
మిషన్లను
ఉపయోగించిన
కారణంగా
తొలిఫలితాల
వెల్లడి
ఉదయం
9
గంటల
కల్లా
మొదలవుతుందని
అధికారులు
చెప్పారు.