వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహంతా ఘోరపరాజయం
గౌహతి: అస్సాంముఖ్యమంత్రి, ఎజిపి నేత మహంతాఅసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన దిస్పూర్నియోజకవర్గంలో ఘోరపరాజయాన్ని చవిచూశారు.మరో నియోజయకవర్గంలోమాత్రం ఆయన ఆధిక్యతతో వున్నారు. అస్సాంలోఫలితాల సరళి తొలుత ఎజిపి-బిజెపి కూటమికీకాంగ్రెస్కు మధ్యపోటాపోటీగా వుంటుందని అనిపించినాఆ తర్వాత మాత్రం కాంగ్రెస్కు స్పష్టమైనఆధిక్యత కనిపిస్తున్నది.
ఈ ఎన్నికల్లోకేవలం కొన్ని చోట్ల మాత్రమే ఎలక్ట్రానిక్ఓటింగ్ యంత్రాలను ఉపయోగించారు. అందువల్లఇక్కడ ఫలితాల వెల్లడిలో జాప్యంజరుగుతున్నది. ఆదివారం సాయంత్రంవరకుఫలితాలు వెల్లడయిన 7 స్థానాల్లో కాంగ్రెస్కుఆరు స్థానాల్లో విజయం లభించింది. కాగా ఎజిపిఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది.ట్రెండ్ను బట్టి చూస్తే ఎజిపి-బిజెపికూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.
Comments
Story first published: Sunday, May 13, 2001, 23:53 [IST]