వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిల్‌పై బెంగాల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార వామపక్ష ఫ్రంట్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరోపణతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎంఎస్‌ గిల్‌, ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి సవ్యసాచి సేన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌కు ఫిర్యాదు చేయాలని పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ కమిటి అసాధారణ నిర్ణయం తీసుకున్నది.

ఎన్నికలు నిష్పాక్షికంగా స్వేచ్చగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తాము పదేపదే తాముచేసిన విజ్ఞప్తులు చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా వ్యర్ధమయ్యాయని బెంగాల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. వామపక్షకూటమి విచ్చలవిడిగా రిగ్గింగ్‌కు బూత్‌ల ఆక్రమణకు పాల్పడిందని పార్టీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఇప్పటికే నిరసన లేఖను తాము ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు పంపినట్టుగా బెంగాల్‌ కాంగ్రెస్‌ కమిటి అధికార ప్రతినిధి తెలిపారు.
ఇదిలా వుండగా శనివారం నాటి రీపోలింగ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టుగా సిపిఎం ఆరోపిస్తున్నది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఒక లేఖను కూడా పార్టీ రాసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X