కేరళముఖ్యమంత్రిపై మల్లగుల్లాలు
త్రివేండ్రం:కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోనియుడిఎఫ్ ఘన విజయం సాధించడంతోముఖ్యమంత్రి పదవికోసం అప్పుడేతర్జనభర్జనలు ప్రారంభమయ్యాయి.కాంగ్రెస్ శిబిరంలో విజయోత్సాహంతో పాటుముఖ్యమంత్రి పదవిపై అప్పుడే మల్లగుల్లాలుప్రారంభమయ్యాయి. కొత్త ముఖ్యమంత్రిఆంటోని అని రాష్ట్రకాంగ్రెస్ నేత వాయలార్ రవిప్రకటించారు. కాగ ముఖ్యమంత్రి పదవిపైతుది నిర్ణయం తీసుకోవల్సింది పార్టీ అధిష్టానవర్గం అని సీనియర్ నేత కరుణాకరణ్ వ్యాఖ్యానించారు.
గెలిచినఆనందం కొద్దిసేపైనా మిగలకుండా అగ్రనేతలమధ్య కుమ్ములాట ప్రారంభం కావడంగమనార్హం. పార్టీ నాయకత్వం కోరితేముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి తానుసిద్ధంగా వున్నానని ఆయన కరుణాకరణ్వెల్లడించారు. కాగా ఈ ఎన్నికల ప్రచారంలోయుడిఎఫ్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగాఆంటోనిని ప్రచారం చేసిన విషయం గురించిప్రస్తావించగా, అలాంటిదేమీ లేదనికరుణాకరణ్ కొట్టిపారేశారు. ముఖ్యమంత్రిఎన్నిక పార్టీ అధిష్టాన వర్గానికి పెద్దతలనొప్పిగా పరిణమించే అవకాశం వున్నది.కరుణాకరణ్ అడ్డు తగులుతున్నప్పటికీకొత్త ఎమ్మెల్యేల్లో అనేక మంది ఆంటోని వర్గీయులేవున్నారు. సోనియా గాంధీ ఆశిస్సులు కూడా ఆయనకేవున్నాయని అంటున్నారు.