అస్సాం సిఎం తరుణ్గొగాయ్
గౌహతి: పూర్తి ఆధిక్యత లభించడంతో ప్రభుత్వ ఏర్పాటకుకాంగ్రెస్ సన్నాహాలు చేసుకుంటోంది. ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నేత తరుణ్ గోగాయ్అస్సాం ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. శాసనసభా పక్ష నేతగాఆయనను పార్టీ శాసనసభ్యులు లాంఛనంగాఎన్నుకుంటారు. రాష్ట్రంలో 124 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ప్రకటించగాకాంగ్రెస్ 72 స్థానాలు గెల్చుకుంది.
అస్సాం గణ పరిషత్ (ఎజిపి), భారతీయ జనతా పార్టీ(బిజెపి) కూటమికి 30 స్థానాలు మాత్రమే దక్కాయి.కాంగ్రెస్ 14 శాతం ఓట్లు అధికంగా పోలయ్యాయి. దీంతోకాంగ్రెస్కు 45 శాతం ఓట్లు వచ్చాయి. ఎజిపి, బిజెపి కూటమి 3 శాతం ఓట్లునష్టపోయింది. ప్రఫుల్ల కుమార్ మహంతాదుష్పరిపాలనకు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుఇది అని కాంగ్రెస్ నాయకుడు పంకజ్ బోరా వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలనుతాము ముందే ఊహించామని ఆయన అన్నారు. ఓటమి పాలు కావడంతోఎజిపి, బిజెపి పరస్పరం విమర్శలుచేసుకుంటున్నాయి.