వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై కోర్టు మాటే బిజెపి బాట

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యవివాదంలో న్యాయస్థానం తీర్పు భారతీయ జనతా పార్టీకిశిరోధార్యమని కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్‌.కె. అద్వానీ సోమవారం లిబర్‌ హాన్‌ కమిషన్‌ ఎదుట స్పష్టం చేశారు. 1992 డిసెంబర్‌ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేతపైవిచారణ జరుపుతున్న జస్టిస్‌ లిబర్‌ హన్‌ కమిషన్‌ ఎదుట అద్వానీ హాజరుకావడం ఇది మూడోసారి. అయోధ్యలో బాబ్రీమసీదును కూల్చివేయడాన్ని న్యాయవిరుద్ధమైన చర్యగా అద్వానీ లిబర్‌ హాన్‌ కమిషన్‌ ఎదుట అభివర్ణించారు.

ఏ పని అయినా చర్చల ద్వారా సామర్యంగా పరిష్కరించుకోవాలని, బలప్రయోగం తగదని ఆయన అన్నారు.బాబ్రీమసీదు కూల్చివేత గురించి వెంటనే నేను ఎంతో వేదనకు లోనయ్యానని అద్వానీ మరో సారి స్పష్టం చేశారు. అయోధ్యపై న్యాయస్థానం ఇచ్చే తీర్పును బిజెపి శిరసావహిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

రామజన్మభూమి వ్యవహారంపై అద్వానీ మాట్లాడుతూ షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పునుఅప్పటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం తుంగలో తొక్కడంతో పాటు, అయోధ్యలో శిలాన్యాసను అనుమతించిందని, ఇప్పుడేమో కాంగ్రెస్‌ పార్టీ వారు బిజెపి ముస్లిం వ్యతిరేకి అని, అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేసి పాపం కట్టుకున్నదని ఆరోపిస్తున్నారని అన్నారు. మసీదు కూల్చివేతపే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సకాలంలో స్పందించి, తదుపరి చర్యలు తీసుకోవడంలోపి.పి. నరసింహారావు ప్రభుత్వం విఫలం అయిందని ఆయన అన్నారు.

షాబానో కేసు విషయంలో కాంగ్రెస్‌ వైఖరి, అయోధ్యలో శిలాన్యాసకు అనుమతించడం వంటి పరిణామాల కారణంగానే బిజెపి అయోధ్యపై తీర్మానం చేయాల్సి వచ్చిందని అన్నారు. ఏది ఏమైనా న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు బిజెపి మనసా వాచా కట్టుబడి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X