అధిష్టానంపై ఫోరం వత్తిడి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానవర్గంపై తీవ్రస్థాయిలో వత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ ఫోరం నిర్ణయించింది. సోమవారం నాడు హైదరాబాద్లో జరిగిన ఫోరం సమావేశంలో తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
తమ డిమాండ్ను అధిష్టానవర్గం అంగీకరించని పక్షంలో అధిష్టానవర్గాన్ని ఎలా ఒప్పించాలో ఆ మార్గాలు తమకు తెలసునని సిఎల్పి డిప్యూటి లీడర్ డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనకు బలమైన ఉద్యమం నిర్మించాల్సిన బాధ్యత పార్టీ కాంగ్రెస్ పార్టీ పై వున్నదని ఆయన చెప్పారు.
తెలంగాణ
విషయంలో
కాంగ్రెస్
పార్టీ
ద్రోహం
చేసిందంటూ
టిఆర్ఎస్
నేత
చంద్రశేఖర్
చేసిన
విమర్శలను
ఫోరం
కన్వీనర్
పురుషోత్తంరెడ్డి
ఖండించారు.
గతంలో
జరిగిన
ప్రత్యేక
తెలంగాణ
ఉద్యమం
కాంగ్రెస్
సారథ్యంలో
జరగలేదని
కాంగ్రెస్నుంచి
విడిపోయినవారు
ఆ
ఉద్యమాన్ని
చేపట్టారని
ఆయన
పేర్కొన్నారు.