వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళకు ఎఐసిసిప్రతినిధులు

By Staff
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళఅసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌శిబిరంలో అనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.సీనియర్‌ నాయకులు కరుణాకరన్‌, ఆంటోనీల మధ్య గల విభేదాలను పరిష్కరించడానికిఅఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి)ప్రతినిధులు గులాం నబీ ఆజాద్‌, మోతీలాల్‌ వోరా నేడో,రేపో తిరువనంతపురం చేరుకుంటారు. విభేదాలు లేకుండా లెజిస్లేచర్‌ పార్టీ నేతనుఎన్నుకోవడం కష్టమేమీ కాదని గులాం నబీఆజాద్‌ అన్నారు.

ఎన్నికలకు ముందు సీట్లకేటాయింపులో కరుణాకరన్‌కు, ఆంటోనీకి మధ్య తీవ్ర విభేదాలుపొడసూపాయి. పోటీ అభ్యర్థులను రంగంలోకి దించడానికిసిద్ధపడిన కరుణాకరన్‌ను అధిష్ఠానంబుజ్జగించింది. దీని కోసం మూడు సీట్లలో అభ్యర్థులనుమార్చింది. ఈ మూడు సీట్లను కూడా కాంగ్రెస్‌గెల్చుకోవడం విశేషం. అధిష్ఠానం ఆదేశిస్తే ముఖ్యమంత్రిపదవి చేపట్టడానికి తాను సిద్ధమేననికరుణాకరన్‌ ప్రకటించారు. దీంతో ఆంటోనీకి,కరుణాకరన్‌కు మధ్య సయోధ్య కుదర్చాల్సినఅవసరం అధిష్ఠానానికి ఏర్పడింది. ఆంటోనీకే ముఖ్యమంత్రిపదవి దక్కే అవకాశాలున్నాయి. యునైటెడ్‌డెమొక్రటిక్‌ ఫ్రంట్‌లోని కాంగ్రెస్‌ ఒక్కటే 62 స్థానాలు గెల్చుకునిప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆధిక్యతనుసంపాదించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X