వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసమ్మతి మంత్రులకు ఉద్వాసన Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

ఇంపాల్‌: మణిపూర్‌లో పీపుల్స్‌ఫ్రంట్‌ ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన మూడునెలల్లోనే అసమ్మతిపై గట్టి వేటు వేసి రాధాబినోద్‌ కోయిజామ్‌ తనసత్తా చూపారు. ఒకే వేటుకు ఆరుగురు అసమ్మతి మంత్రులను కేబినెట్‌నుంచి తప్పిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది.

అటవీశాఖ మంత్రి గంగూముమై కమై, రవాణా శాఖ మంత్రి కాశీం మువా, క్రీడల శాఖ మంత్రి రాజన్‌ సింగ్‌, ఆహారం పౌరసరఫరాల శాఖ మంత్రి బిరేన్‌ సింగ్‌, పరిశ్రమల శాఖ మంత్రి కుంజో సింగ్‌, ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఎ బిరేన్‌సింగ్‌ను మంత్రి మండలినుంచి తప్పిస్తూ గవర్నర్‌కు ముఖ్యమంత్రి సిఫారసు చేశారు.

ముఖ్యమంత్రి సిఫారసు గవర్నర్‌ వేద్‌ప్రకాష్‌ మార్వా అంగీకరించారు. స్పీకర్‌ సపమ్‌ ధనంజయ్‌ నాయకత్వంలో గత వారం రోజులుగా 34
మంది ఎమ్మెల్యేలు కోయిజామ్‌ ప్రభుత్వం పతనానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలకు ఈ ఆరుగురు మంత్రుల మద్దతు కూడా వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X