కేరళ కొత్త సిఎం ఎకె ఆంటోనీ
త్రివేండ్రం: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎకె ఆంటోనీ ఎన్నికయ్యారు. పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సూచన మేరకు ఆంటోనీని లెజిస్లేచర్ పార్టీ కొత్తనేతగా ఎన్నుకున్నారు.
పార్టీ నాయకత్వం విషయం ఎటూ తేలకపోవడంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపికబాధ్యతను పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి అప్పగిస్తూ మంగళవారం ఉదయం కేరళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఒక తీర్మానం చేసింది. పార్టీ ఎమ్మెల్యేల మనోగతం తెలుసుకోవడానికి అధిష్టానవర్గం దూతలుగా వచ్చిన గులాంనబీ ఆజాద్, మోతిలాల్వోరాలు రెండు రోజులుగా ఈ విషయంలో ఏకాభిప్రాయసాధనకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఎక్కువ
మంది
ఎమ్మెల్యేలు
ఆంటోని
అభ్యర్ధిత్వానికి
అనుకూలంగా
వున్నట్టుగా
చెబుతున్నారు.
అయితే
మరో
బలమైన
గ్రూప్కు
నేతగా
వున్న
కరుణాకరణ్
ఈ
పదవికోసం
గట్టిపట్టుదలతో
వున్నకారణంగా
ఒక
ఎమ్మెల్యే
సూచన
మేరకు
సోనియాపై
భారం
వేస్తూ
తీర్మానం
చేశారు.
ఈ
తీర్మానం
దరిమిలా
గులాంనబీ,
వోరా
ఢిల్లీకి
ఫోన్
చేసి
సోనియాతో
మంతనాలు
జరిపి
చివరకు
ఆంటోనీ
పేరును
ఖరారు
చేశారు.