నాబార్డ్ బుణం పెంపు
హైదరాబాద్ : ఆధ్రప్రదేశ్కు నాబార్డ్ బుణసహాయాన్ని తగ్గించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నాబార్డ్ ఛేర్మన్ వై.సి.నందన్ ఖడించారు.మంగళవారం నాడు నాబార్డు బుణ సహాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఆధ్రప్రదేశ్కు నాబార్డ్ 5000 కోట్ల రూపాయల బుణ సహాయాన్ని అందించినట్టు తెలిపారు.
ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్కు నాబార్డు బుణ సహాయాన్ని 12 శాతం పెంచినట్టు నందన్ వివరించారు. ఆధ్రప్రదేశ్కు తాము పూర్తి స్ధాయిలో సహకారం అందిస్తున్నట్టు నందన్ పూర్కొన్నారు. రుణసాయాన్ని పెంచడంతో పాటు ప్రపంచవాణిజ్య సంస్థ ఒప్పందం దరిమిలా వ్యవసాయ రంగంపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో తీసుకుంటున్న చర్యలకు తాము అన్ని విధాల సహకరిస్తామని నందన్ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల ప్రాజెక్టుకు పూర్తి సాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.