వడదెబ్బకు 30 మంది మృతి
హైదరాబాద్ః రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతునే వుంది. సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల జల్లులు పడి, ఉష్ణోగ్రత భారీగా తగ్గినప్పటికీ మంగళవారం ఉదయం నుంచే ఎండ నిప్పులు చెరుగుతున్నది. సోమవారం ఎండల తీవ్రతకు రాష్ట్రంలో 30 మంది మరణించారు.
కృష్ణా జిల్లాలో అత్యధికంగా 9 మంది వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.విస్సన్నపేటలో ఐదుగురు వృద్ధులు మరణించారు. గుంటూరు, కడప, తూర్పుగోదావరి, వరంగల్, ప్రకాశం, కరీంనగర్, నెల్లూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో వృద్ధులతో పాటు కొందరు మధ్య వయస్కులు కూడా వడదెబ్బ కారణంగా మరణించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఒక బాలిక, ఒక గృహిణి ఎండ తీవ్రతకు మరణించారు. గత నాలుగురోజులుగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ఖమ్మం, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలలో సోమవారం అక్కడక్కడా వర్షాలు పడడంతో ఎండ వేడిమి కాస్త తగ్గింది. ఖమ్మంలో సోమవారం ఉష్ణోగ్రత 43.7 డిగ్రీలుగా నమోదైంది.విజయవాడలో 39, హైదరాబాద్ లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదైంది.