వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపి కోటపై కాంగ్రెస్‌ దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్‌ విజయోత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా వుంది. ఈ విజయం దరిమిలా కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై పార్టీ దృష్టి కేంద్రీకరించింది.

యుపి ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అవకాశం వుండటంతో ఇప్పటినుంచే యుపిలో గెలుపునకు ప్రయత్నాలు ప్రారంభించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే వారం యుపి సీనియర్‌నేతలతో సోనియా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌వాది పార్టీ, కాన్షీరామ్‌ బహుజన్‌ సమాజ్‌ పార్టీ, ప్రధాని వాజ్‌పేయి బిజెపిని ఎదుర్కోవడం సాధారణవిషయం కాదన్న విషయం గుర్తించిన కాంగ్రెస్‌ అగ్రనేత ఆ రాష్ట్ర శాఖలో భారీ ఎత్తున భారీ మార్పులకు సన్నాహాలు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లో ఆరోసారి విజయభేరి మోగించిన కమ్యూనిస్టులు తమ విజయం కోసం అనుసరించిన వ్యూహాన్ని ఈ సారి ఎన్నికల్లో తాము అనుసరించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ వుంది. తమ కార్యకర్తలను ఉపయోగించుకుని మారుమూల పల్లెల్లో కూడా బ్రహ్మాండంగా కాంపెన్‌ చేసిన లెఫ్ట్‌ పార్టీ బాటలోనే కార్యకర్తల బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X