పరేఖ్ స్కామ్లో 2000 కోట్లు
ముంబాయి:ఇటీవల స్టాక్ మార్కెట్ స్కామ్లో బడా బుల్ కేతన్ పరేఖ్ ప్రమేయం 2000 కోట్ల రూపాయలకు పైగా వుంటుందని సెబి తాజాగా అంచనావేసింది. వివిధ కంపెనీల ప్రమోటర్లతో కుమ్మక్కైన పరేఖ్ వారినుంచి సుమారు 800 కోట్లరూపాయలు సమీకరించినట్టుగా సెబి దర్యాప్తులో వెల్లడయింది. బ్యాంకింగ్ రంగంలోని లోపాలను తెలివిగా ఉపయోగించుకోవడం ద్వారా మరో 1200 కోట్ల రూపాయలను పరేఖ్ సమీకరించగలిగారు.
ఈ భారీ మొత్తం నిధులను పరేఖ్ స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ హెచ్ఎప్సిఎల్, జీ టెలీ, డిఎస్క్యూ, గ్లోబల్ టెలీ వంటి స్క్రిప్స్ ధరలను రిగ్గింగ్ చేయడానికి ఉపయోగించాడని సెబి పేర్కొంది. పరేఖ్ కంపెనీల కార్యకలాపాలను పరిశీలించిన సెబి దర్యాప్తు ఎంపిక చేసిన షేర్లలో షేర్ల ధరల రిగ్గింగ్కు వారు పాల్పడిన విషయాన్ని నిర్ధారించింది. విదేశీ సంస్థలు, కొందరు ఎఫ్ఐఐలతో కూడా పరేఖ్కు సంబంధాలు వున్న విషయం సెబి వెల్లడించింది.