ప్రభుత్వ ఏర్పాటుకుకాంగ్రెస్ సన్నాహాలు
చెన్నై: పాండిచ్చేరీలోప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. తమిళమనీలా కాంగ్రెస్ (టిఎంసి) తో పాటు అన్నాడియంకెను కూడా కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయమైఅన్నాడియంకె నేత జయలలితతో చర్చించడానికికాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ ఇక్కడికి వచ్చారు.ఆయన బుధవారం సాయంత్రం జయలలితనుకలుసుకుంటారు. లాంఛనంగా అన్నాడియంకె తమకుమద్దతు ప్రకటించాల్సి వుందని ప్రణబ్ ముఖర్జీచెప్పారు.
అన్నాడియంకె ప్రభుత్వంలో చేరుతుందా,బయటి నుంచి మద్దతు ఇస్తుందా అనేది తేలాల్సివుంది. 30 స్థానాలు గల పాండిచ్చేరి అసెంబ్లీలోకాంగ్రెస్, టిఎంసి కూటమికి 13 సీట్లు లభించగా,అన్నాడియంకెకు మూడు సీట్లు వచ్చాయి. డిఎంకెకు 12సీట్లు లభించాయి. తాము ప్రభుత్వం ఏర్పాటుచేయడం సాధ్యం కాదని తేల్చుకున్న డిఎంకె ప్రతిపక్షంలో కూర్చుంటామనిప్రకటించింది. దీంతో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకుముమ్మరంగా చర్యలు ప్రారంభించింది.