దత్తత కేసులో దొరికిన సరిత
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన శిశువుల దత్తత కుంభకోణం కేసులో పోలీసులు గాలిస్తున్న అనితాసేన్ సహచరురాలు సరిత బండలను పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. హైబిపి, డయాబెటిస్ వ్యాధులతో సరిత నగరంలోని యశోధ సూపర్స్పెషాలిటీ అస్పత్రిలో వున్నట్టుగా సిఐడి పోలీసులకు సమాచారం అందింది.
స్వయంగా
ఆమె
భర్తనే
సరిత
ఎక్కడవున్నది
పోలీసులకు
తెలియజేశారని
అంటున్నారు.
హూటాహూటీన
ఆస్పత్రికి
వెళ్లి
ఆమెను
అరెస్టు
చేసిన
పోలీసులు
ఆమెను
మేజిస్ట్రేట్
ఎదుట
హాజరు
పరిచారు.
ప్రీషియస్
మూమెంట్
నిర్వాహకురాలు
అనితాసేన్
సహాయకురాలైన
సరిత
గత
కొద్దిరోజులుగా
పోలీసులను
తప్పించుకుని
తిరుగుతున్న
విషయం
విదితమే.
అనితాసేన్,
సరిత,
మరో
శిశుకేంద్రం
నిర్వాహకురాలు
సావిత్రమ్మల
ఆచూకీ
తెలిపిన
వారికి
ప్రభుత్వం
5
లక్షల
రూపాయల
చొప్పున
బహుమతి
ప్రకటించిన
విషయం
విదితమే.
అనితాసేన్
దాఖలు
చేసుకున్న
ముందస్తు
బెయిల్
పిటీషన్
హైకోర్టు
జూన్
4న
విచారిస్తుంది.
కాగా
అనితాసేన్
భర్త
సీనియర్
ఐపిఎస్
అధికారి
స్వరణ్జిత్
సేన్
ఆయన
ఇద్దరు
కుమారులను
విచారణకు
హాజరుకావల్సిందిగా
మరోసారి
సిఐడి
నోటీసులను
జారీ
చేసింది.