ఇరాన్ విమానం కూలిప్రయాణికుల మృతి
టెహ్రాన్: ఇరాన్ విమానం గురువారం కుప్పకూలడంతోఅందులో ప్రయాణిస్తున్న రవాణా మంత్రి రహ్మాన్దాద్మన్, ఇద్దరు డిప్యూటీ మంత్రులు,ఏడుగురు పార్లమెంటు సభ్యులతో ప్రయాణికులందరూమరణించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలుధృవీకరించాయి.
రష్యా తయారు చేసిన ఈ యాక్-40విమానంలో 32 మంది వున్నట్లు భావిస్తున్నారు.వాతావరణం బాగా లేకపోవడంతో అత్యవసరంగాసరిలో దిగుతున్నట్లు ప్రకటించిన మరు క్షణమేవిమానం రాడార్ తెర నుంచి మాయమైంది. అబ్రు ప్రాంతంలోనిపర్వతాల్లో అన్వేషణ, సహాయ బృందాలు విమానం కోసం వెతుకుతున్నట్లుగొలిస్తాన్ ప్రోవిన్స్ గవర్నర్ అలీ అస్ఘర్ అహ్మదిచెప్పారు.
విమానం 24 మంది ప్రయాణికులతో,ఎనమండుగురు విమాన సిబ్బందితో తెహ్రాన్నుంచి బయలుదేరినట్లు ఉపరితల రవాణాఅధికార వర్గాలు చెప్పాయి. గోర్గాన్లో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సినదాద్మాన్, ఇద్దరు డిప్యూటీ మంత్రులు మొహమ్మద్ జాఫర్బహ్రామీ, హసన్ దెహ్గాన్, ఏడుగురు పార్లమెంటు సభ్యులు ఈవిమానంలో వున్నారు. జనవరిలో జరిగిన మంత్రివర్గపునర్వ్యస్థీకరణలో దాద్మాన్ రవాణా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయన అధ్యక్షుడు మహ్మద్ ఖతామికి అత్యంతసన్నిహితుడు.