వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నంద్యాల ప్రమాదంలో ఆరుగురు మృతి
కర్నూలుః కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
నంద్యాల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు డీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అది చాలదన్నట్లు ఈ రెండు లారీలు డీకొన్న వెంటనే వాటిను మామిడికాయల లోడ్ తో వస్తున్న మరో లారీ డీ కొనడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. రెండు లారీల డ్రైవర్లు కూడా ఈ ప్రమాదంలో మరణించారు.
Story first published: Thursday, May 17, 2001, 23:53 [IST]