సిఎం పీఠానికికాంగ్రెస్లో పోటాపోటీ
చెన్నై: పాండిచ్చేరీ ముఖ్యమంత్రిపదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ నేతల మధ్య పోటీతీవ్రమైంది. కాంగ్రెస్ నేతలు షణ్ముగం, నారాయణస్వామి,ఫరూఖ్, వైద్య లింగం ముఖ్యమంత్రి పదవికిరేసులో వున్నారు. పాండిచ్చేరిలో కాంగ్రెస్, టిఎంసి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకుఅన్నాడియంకె నేత జయలలిత బేషరతుమద్దతు ప్రకటించారు. ఇందుకు గాను కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ జయలలితకు కృతజ్ఞతలుతెలియజేశారు.
ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం గులాంనబీ ఆజాద్, మోతీలాల్ వోరా శుక్రవారం పాండిచ్చేరిచేరుకుంటారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేతఎంపికపై వీరు చర్చలు జరుపుతారు. కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడితో, సీనియర్ నేతలతో, శాసనసభ్యులతో వ్యక్తిగతంగా కూడాచర్చలు జరుపుతామని గులాం నబీ ఆజాద్ గురువారంవిలేకరులతో చెప్పారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) సమావేశం శుక్రవారం జరుగుతుంది.ప్రభుత్వంలో తమిళ మనీలాకాంగ్రెస్కు కూడా స్థానం కల్పిస్తామని ఆయనచెప్పారు.
ఇదిలా వుండగా, తమిళనాడు,పాండిచ్చేరిలలో కాంగ్రెస్, టిఎంసి కూటమి మంచి ఫలితాలు సాధించడంతో రెండు పార్టీలవిలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడు పిసిసి నేత ఎలంగోవర్ గురువారంకాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని న్యూఢిల్లీలో కలిసి ఈవిషయమై చర్చించారు. విలీనంపై టిఎంసి నేతముపనార్ తుది నిర్ణయం తీసుకుంటారని, విలీనంఎప్పుడనేది కూడా ఆయనే నిర్ణయిస్తారని ఎలంగోవర్చెప్పారు.