వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యేక తెలంగాణా తధ్యంఃసొరేన్
హైదరాబాద్ః ప్రత్యేక తెలంగాణా ఏర్పాటై తీరుతుందని జార్ఖండ్ ముక్తి మోర్చా నేత శిబూసొరేన్ అన్నారు. ఇటీవలే మూడు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం సువిశాలమైన తెలంగాణా ఏర్పాటువిషయంలో ఎందుకు వెనకాడుతున్నదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణా రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కరీంనగర్ లో జరిగే సింహగర్జన సభలో పాల్గొనేందుకు సొరోనే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆయనవిలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కేంద్ర రాష్ట్రాలు పట్టు విడుపు ధోరణి ప్రదర్శించాలని శిబూసొరేన్ సూచించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటై తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Story first published: Thursday, May 17, 2001, 23:53 [IST]