వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా సాధించే దాకా నిద్రపోనుః చంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ప్రత్యేక తెలంగాణా సాధించే వరకు తెలంగాణా రాష్ట్ర సమితివిశ్రమించదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. కరీంనగర్‌ లో తలపెట్టిన సింహగర్జనకు బయలుదేరడానికి ముందు చంద్రశేఖర రావువిలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌ సభకు వేలాదిగా జనం తరలి వస్తున్నారని సింహగర్జనసక్సెస్‌ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరో వైపు ప్రత్యేక తెలంగాణా ఉద్యమ భేరి మోగించిన మాజీ డిప్యూటీస్పీకర్‌ చంద్రశేఖర్‌ రావు గురువారం కరీంనగర్‌ లో తలపెట్టిన సింహగర్జనకు భారీ ఏర్పాటు జరిగాయి. చంద్రశేఖర రావుతో పాటు పలువురు జాతీయ నాయకులు గురువారం ఉదయం హైదారాబాద్‌ నుంచి ఊరేగింపుగా కరీంనగర్‌ కు తరలి వెళ్ళారు. సింహగర్జనకుపెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని టిఆర్‌ఎస్‌ నేతలు ఆశిస్తున్నారు.

బుధవారం కరీంనగర్‌ లో ఈదురుగాలులువీయడంతో సభ ఏర్పాట్లు కొంత నెమ్మందించాయి. అయితే ఈ పనులు గురువారం మధ్యాహ్నానికి పూర్తి చేస్తామని టిఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఇప్పటికే కరీంనగర్‌ లో టిఆర్‌ఎస్‌ పతాకాల రెపరెపలు కనిపిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ సభ ఏ మాత్రంవిజయవంతం అవుతుందో అని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X