వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీఎన్నికలు ఓ గుణపాఠంః వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కేంద్ర క్యాబినెట్‌ ను ఓ పక్షం రోజుల్లోవిస్తరించనున్నట్లు ప్రధాన మంత్రి వాజ్‌ పేయి చెప్పారు. నాలుగురోజుల పాటు కౌలాలంపూర్‌ పర్యటించి వచ్చిన వాజ్‌పేయి బుధవారం రాత్రి న్యూఢిల్లీ విమానాశ్రయంలోవిలేకరులతో మాట్లాడారు. జూన్‌ మొదటి వారంలోమీ మోకాలి శస్త్ర చికిత్స అనంతరం మంత్రి వర్గవిస్తరణ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా కావచ్చు అని వాజ్‌పేయి బదులిచ్చారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ సర్కార్‌ కు అశనిపాతం కాదా అనే ప్రశ్నకుఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాకో హెచ్చరిక వంటివి. లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా ఈ ఫలితాలను దృష్టిలో వుంచుకొని వ్యూహం రూపొందించుకోవాల్సి వుంటుందని ఆయన చెప్పారు.

దేశంలో మధ్యంతర ఎన్నికల ప్రసక్తి లేదని వాజ్‌పేయి చెప్పారు. లోక్‌ సభ ఎన్నికలు గడువు ప్రకారమే జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తనకు ఆపరేషన్‌ చేసిన చిత్తరంజన్‌ రాణావత్‌జూన్‌ 6,7 తేదీలలో ముంబయ్‌ లోని బ్రీచ్‌ కాండి ఆస్పత్రిలో తన మోకాలికి ఆపరేషన్‌ చేస్తారని వాజ్‌పేయి వివరించారు.

ఆతరువాత మంత్రి వర్గ విస్తరణ వుంటుందని ఆయన సూచించారు. ఎన్నికల్లోఘోరపరాజయం పాలైన తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని మళ్ళీ ఎన్డీఏలో చేర్చుకుంటారా అనే ప్రశ్నకు అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదన్నారు.

ఉత్తర ప్రదేశ్‌ లోని షాజ్‌ హాన్‌ పూర్‌ లోక్‌ సభకు జరిగిన ఎన్నికల్లో బిజెపి నాలుగో స్థానానికి పడిపోవడం గురించి ప్రస్తావించగా ఈ ప్రమాద ఘంటికలను మేమూవింటున్నాం తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. జైలుశిక్ష పడిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావడంపై వ్యాఖ్యానించమని కోరగా వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని మాత్రమే వాజ్‌పేయి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X