8న ఆరులక్షల మందికి చేపమందు
హైదరాబాద్ః ఉబ్బసం వ్యాధి గ్రస్థుల పాలిట కామధేనువుగా, ప్రపంచదేశాల ప్రజలు భారీగా ఆదరిస్తున్న చేపమందును జూన్ 8న పంపిణీ చేయనున్నట్లు బత్తిన గౌడ్ సోదరులు ప్రకటించారు. మృగశిరకార్తె ప్రారంభం రోజైన జూన్ 8న సుమారు ఆరు లక్షల మందికి చేపమందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో వెల్లడించారు. చేపమందు పంపిణీ గురించి దేవేందర్ గౌడ్ బత్తిన సోదరులతో చర్చించారు.
చేపమందు కోసం భారత దేశంలో నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది తరలి వస్తారు. చేపమందు తీసుకొనే వారికోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు దేవేందర్ గౌడ్ ఈ సందర్భంగా వివరించారు. చేప మందు పంపిణీ సందర్భంగా నాసిరకం చేప పిల్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని, అలా కాకుండా లక్షల సంఖ్యలో చేపపిల్లలను ప్రభుత్వం ముందుగానే సేకరించే ప్రయత్నం చేస్తున్నదని గౌడ్ వివరించారు.
చేప పిల్ల నోట్లో మందు పెట్టి ఆ చేపను రోగి నోట్లో వుంచుతారు. ఈ మందు తీసుకున్న వారు కొద్ది రోజులు పత్యం పాటించాల్సి వుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ చేపమందు తీసుకుంటున్న వారిలో వున్నారు.
ఆధునిక
వైద్యం
సాధించలేని
ఫలితం
ఈ
చేపమందు
ద్వారా
లభిస్తున్నదని
పలువురు
చెబుతూ
వుంటారు.
ఏటా
ఈ
చేపమందు
పంపిణీ
ఓ
తిరణాలలా
జరుగుతూ
వుంటుంది.
ఎటువంటి
ఇబ్బందులు
లేకుండా
మందు
తీసుకొనేందుకు
వచ్చే
వారికి
అన్ని
సౌకర్యాలు
ఏర్పాటు
చేయాలని
దేవేందర్
గౌడ్
అధికారులను
ఆదేశించారు.