వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు లక్షలమంది సింహగర్జన!

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః కరీంనగర్‌ లో గురువారం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా సింహగర్జన సభకు కనీసం రెండు లక్షల మందిహాజరై వుంటారని పోలీసు వర్గాలు అంచనా వేశాయి. ముఖ్యంగా చంద్రశేఖర రావు నియోజక వర్గమైన సిద్దిపేట నుంచి కొందరు ప్రజలను సమీకరించినప్పటికీ అన్ని తెలంగాణా జిల్లాల నుంచి ప్రజలుస్వచ్ఛందంగా తరలి వచ్చారు. సోనియా గాంధీ వంటి జాతీయ నేతల సభలకుమినహా ఇంత జనం ఎప్పుడూ రాలేదని రాజకీయ పరిశీలకు వ్యాఖ్యానించారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచే ప్రజలు సభా స్థలికి చేరుకున్నారు. రాత్రి ఏడుగంటలయ్యే సరికి సభా స్థలి జనసంద్రంలా మారిపోయింది.

సభకు వచ్చిన వారిలో చాలా మంది యువకులే కనిపించారు. సభకుహాజరైన వారిలో 70 శాతం మంది 30 సంవత్సరాలలోపు యువకులే. మధ్యాహ్నం నుంచి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా జనం నుంచివిశేష స్పందన కనిపించింది. ఈ స్పందనను చూసిన టిఆర్‌ఎస్‌ నేతలలో ఆనందం వెల్లివిరిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X