రెండు లక్షలమంది సింహగర్జన!
కరీంనగర్ః కరీంనగర్ లో గురువారం టిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా సింహగర్జన సభకు కనీసం రెండు లక్షల మందిహాజరై వుంటారని పోలీసు వర్గాలు అంచనా వేశాయి. ముఖ్యంగా చంద్రశేఖర రావు నియోజక వర్గమైన సిద్దిపేట నుంచి కొందరు ప్రజలను సమీకరించినప్పటికీ అన్ని తెలంగాణా జిల్లాల నుంచి ప్రజలుస్వచ్ఛందంగా తరలి వచ్చారు. సోనియా గాంధీ వంటి జాతీయ నేతల సభలకుమినహా ఇంత జనం ఎప్పుడూ రాలేదని రాజకీయ పరిశీలకు వ్యాఖ్యానించారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచే ప్రజలు సభా స్థలికి చేరుకున్నారు. రాత్రి ఏడుగంటలయ్యే సరికి సభా స్థలి జనసంద్రంలా మారిపోయింది.
సభకు వచ్చిన వారిలో చాలా మంది యువకులే కనిపించారు. సభకుహాజరైన వారిలో 70 శాతం మంది 30 సంవత్సరాలలోపు యువకులే. మధ్యాహ్నం నుంచి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా జనం నుంచివిశేష స్పందన కనిపించింది. ఈ స్పందనను చూసిన టిఆర్ఎస్ నేతలలో ఆనందం వెల్లివిరిసింది.