వానరం దాడులుతో వణుకుతున్న ఢిల్లీ
న్యూఢిల్లీః వింత ఆకారం దాడులతో దేశ రాజధాని నగరం ఢిల్లీ గజగజలాడి పోతున్నది. రెండు రోజులుగా దాడుల తీవ్రత కాస్త తగ్గించిన ఈ వింత ఆకారం బుధవారం రాత్రి మళ్ళీ విజృంభించింది. బుధ, గురువారాలలో ఈ వింత ఆకారం జరిపిన దాడులలో 18 మంది గాయపడ్డారు. వింత ఆకారం దాడికి భయపడి డాబామీద నుంచి పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వెయ్యిమంది పోలీసులు రేయింబవళ్ళు ఈ వింత ఆకారం కోసం గాలింపు చేపడుతున్నప్పటికీ, ఆ ఆకారం యదేశ్ఛగా దాడులు కొనసాగించడంవిశేషం.
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈ వింత ఆకారం దాడిలో 18 మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి.వీరి పరిస్థితి ఆందోళన కరంగా వున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రాత్రిళ్ళు డాబాలమీద పడుకున్న వారిని ఈ వింత ఆకారం టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నది. ఇంత వరకు ఈ వింత ఆకారం రూపు రేఖలపై ఢిల్లీ పోలీసులు ఒక స్పష్టమైన అభిప్రాయానికి రాలేక పోయారు. ఈ వారం రోజులలో ఈ వింత ఆకారం దాడులకు ఇద్దరు మరణించగా కనీసం 50 మంది గాయపడ్డారు.
ఢిల్లీ
పోలీసుల
బుర్రలు
తొలిచేస్తున్న
ఈ
వింత
ఆకారం
వ్యవహారం
నానాటికీ
జటిలం
అవుతున్నది.
లైట్
పిస్టళ్ళతో
రాత్రుళ్ళు
వెయ్యి
మంది
పోలీసులు
గస్తీ
తిరుగుతున్నారు.
ఈ
వింత
ఆకారాన్ని
కనిపిస్తే
కాల్చివేయాల్సిందిగా
ఆదేశాలు
జారీ
అయ్యాయి.
ఈ
ఆకారం
గురించి
ఢిల్లీలో
పుకార్లు
షికార్లు
చేస్తున్నాయి.
తల్లిదండ్రులు
పిల్లలను
బయటకు
పంపాలంటే
భయపడి
పోతున్నారు.
శివారు
ప్రజలు
ప్రాణాలు
అరచేతిలోపెట్టుకొని
గడుపుతున్నారు.
- ఢిల్లీలో కిష్కింధకాండ-వెయ్యిమంది పోలీసుల వేట
-
పోలీసుగస్తీతో
మాయమైన
ఢిల్లీ
వానరం!