వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింహగర్జనపై పార్టీల మనోగతాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : గురువారం నాడు కరీంనగర్‌లో జరిగిన సింహగర్జన విజయవంతం కావటంతెలంగాణా ప్రజల మనోభావానికి ప్రతిబింబమని కాంగ్రెస్‌, బిజెపిలు అభివర్ణించాయి. శుక్రవారం నాడు కాంగ్రెస్‌ నాయకుడు డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాము చంద్రశేఖరరావు చేస్తున్న ఉద్యమాన్ని వ్యతిరేకించటం లేదని, ప్రత్యేకతెలంగాణాకోసం తఆముకూడా తమదైన రీతిలో పోరాడుతున్నామని, అలాంటప్పుడు ఆయన తమను విమర్శించటం అర్ధంలేని విషయమని ఆయన అన్నారు.

బిజెపి అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎన్‌డిఏ ఎజెండాలో ప్రత్యేక తెలంగాణా అంశం లేకపోవటంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని, బిజెపి అజెండాలో మాత్రం ప్రత్యేక తెలంగాణా ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. బిజెపికి సొంతగా బలం ఏర్పడితే తప్పకుండా ప్రత్యేక తెలంగాణాను ఏర్పరచుతుందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణా అవసరమే లేదన్నారు. తాము ప్రత్యేక తెలంగాణాను సమర్ధించే ప్రశ్నేలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ర్యాలీ విజయవంతం అయినంతమాత్రాన ప్రజలంతా వారివెంటవున్నారని చెప్పటం సరైనది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X