కాల్పుల విరమణపై అద్వానీ మంతనాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ పొడిగించే విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు ఎల్కె అద్వానీ, జస్వంత్సింగ్ శనివారం నాడు శ్రీనగర్ సందర్శించారు. అద్వానీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో త్రివిధ బలాల ప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇంటలీజెన్స్ అధికారులు, ఇతర భద్రతా సంస్థల అధికారులు పాల్గొన్నారు.
జమ్మూకాశ్మీర్
ముఖ్యమంత్రి
ఫరూఖ్
అబ్లుల్లా,
గవర్నర్
సక్సేనా
కూడా
సమావేశానికి
హాజరయ్యారు.
రాష్ట్రంలో
నెలకొని
వున్న
తాజా
పరిస్థితిని
కేంద్ర
మంత్రులకు
సమావేశంలో
పాల్గొన్న
భద్రతా
దళాల
ప్రతినిధులు
వివరించారు.
జమ్మూకాశ్మీర్లో
కాల్పుల
విరమణకు
గడువు
ఈ
నెలాఖరుతో
ముగుస్తున్నది.
ఈ
లోపే
గడువు
పొడగించాలా
లేదా
నిర్ణయించేందుకు
కేంద్ర
భద్రత
వ్యవహారాల
కమిటీ
సమావేశం
అవుతున్నది.
కమిటీ
తగిన
నిర్ణయం
తీసుకునేందుకు
వీలుగా
పరిస్థితిని
ప్రత్యక్షంగా
పరిశీలించేందుకు
కేంద్రమంత్రులు
శ్రీనగర్కు
వచ్చారు.
ఈ
మంత్రుల
బృందం
చేసిన
సిఫారసు
పై
కేంద్ర
కమిటి
తుది
నిర్ణయం
తీసుకుంటుంది.
ఈ
సమావేశం
దృష్ట్యా
అధికారులు
అసాధారణ
భద్రతా
ఏర్పాట్లు
చేశారు.
కాల్పుల విరమణ పొడగింపునకు తమ ప్రభుత్వం సానుకూలంగా వున్నదని అయితే తుదినిర్ణయం కేంద్రంపై ఆధారపడివున్నదని ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. హోం మంత్రి అద్వానీ తాము తమ మదింపు నివేదికను కేంద్ర మంత్రివర్గ కమిటీకి అందజేస్తామని తుది నిర్ణయం కమిటీదేనని చెప్పారు. ఈ విషయంలో తాను ఏలాంటి ఊహాగానాలు చేయదల్చుకోలేదని ఆయన తెలిపారు.