వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏను వీడబట్టే మమతకు శాస్తి

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ : తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్‌డిఏను వదలి వెళ్లటంపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ విరుచుకుపడ్డారు. శనివారం నాడు ఆమె లండన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బెంగాల్‌ ఎన్నికలు మమతాబెనర్జీకి పెద్ద గుణపాఠం నేర్పాయన్నారు.

ఎన్డీఏను వీడటంద్వారా ముస్లీం ఓట్లన్నీ తనకుపడి తాను గెలుస్తానని ఆమె కన్న కలలు తుదకు కల్లలయ్యాయని సుష్మా అన్నారు. మమత ఎన్డీఏను వీడటాన్ని ప్రజలు హర్షించలేకపోయారు, ఆమె ఎందుకు ఇలా చేసిందని ప్రజలు ప్రశ్నించారు, బాధ్యతారాహిత్యాన్ని తప్పుబట్టారు అని సుష్మ వ్యాఖ్యానించారు.

మమతకు ప్రజలలో పలుకుబడి వున్నప్పటికీ, తగు వైన ఎన్నకల యంత్రాగంలేదు. ఆ యంత్రాంగాన్ని అందించగల బిజెపిని ఆమె వీడకుంటే ఆమె విజయం సాధించేవారు అని సుష్మ విశ్లేషించారు. ఎన్నికలలో బిజెపిపై తెహెల్కా ప్రభావం పనిచేసిందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ఆ విషయం ఎక్కడా ఒక సమస్యగా ఉత్పన్నం కాలేదు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X