ప్రత్యేక ఆంధ్ర కూడా కావాలిః రెడ్డయ్య
హైదరాబాద్ః ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా అవసరం ఎంత ఉందో ప్రత్యేక ఆంధ్ర అవసరం కూడా అంత ఉందని మచిలీపట్నం మాజీ ఎం.పి కెపి రెడ్డయ్య యాదవ్ అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో వెనుకబడిన వ్యవసాయిక కుటుంబాలు దుర్భర పరిస్ధితులను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.
ఉమ్మడి కుటుంబం నుంచి అన్నదమ్ములు ఎలా విడిపోతారో అలా ఆంధ్ర, తెలంగాణా పరస్పర ప్రేమతో విడిపోతే తప్పులేదని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన చిన్న రాష్ట్రాల ఏర్పాటును గట్టిగా సమర్ధించారు. విశాలాంధ్ర వల్లఇటు కోస్తా ఆంధ్రలోను, అటు తెలంగాణాలోను కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే లాభం పొందాయని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలు తాము ఆంధ్రుల వల్లనే వెనుకబడిపోయామన్న అభిప్రాయం కేవలం అపోహ మాత్రమేనని, కోస్తా ఆంధ్రకు కొన్ని దశాబ్దాల క్రితమే ఒక రాజధాని ఏర్పడి ఉంటే అక్కడి నుంచి వలసలు తప్పిఉండేవని ఆయన ఆన్నారు. ఇప్పటికీ విశాలాంధ్ర కావాలనుకునే వారికి స్వార్ధ ప్రయోజనాలున్నాయని, పొట్టకూటి కోసం పనిచేసుకునే వారికి ఇవన్నీ నిరర్ధకమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు వారు ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా బలహీన వర్గాల వారి శ్రేయస్సు ప్రధానమని, ఇప్పటి వరకు రెండు ప్రాంతాల్లోనూ పెత్తందారీ వర్గాలే దోపిడీ చేశాయని రెడ్డయ్య అన్నారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల వల్ల సామాన్య ప్రజానీకానికి పెద్ద నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. పివి నరసింహారావు చూపిన దారిని అనుసరించిన చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజానీకాన్ని లూటీ చేయడంలో రికార్డులు బద్దలు కొడుతున్నారని ఆయన విమర్శించారు.
ప్రత్యేక
తెలంగాణా
ఉద్యమాన్ని
నడిపిస్తున్న
చంద్రశేఖరరావును
ఆయన
అభినందించారు.
అయితే
ఆయన
కాంగ్రెస్,
తెలుగుదేశం
పార్టీల
నుంచి
వచ్చే
నాయకులను
పక్కన
బెట్టి,
తెలంగాణా
రాష్ట్ర
సమితిలోని
వారికి
మాత్రమే
ప్రాధాన్యం
ఇవ్వాలని
సూచించారు.
తనకు
ఎటువంటి
స్వార్ధప్రయోజనాలు
లేవని
ప్రత్యేక
తెలంగాణా,
ప్రత్యేక
కోస్తా
ఆంధ్ర
ఏర్పడడం
వల్ల
ఎవరి
భవిష్యత్తు
వాళ్ళ
చేతుల్లో
ఉంటుందన్న
అభిప్రాయమేనని
ఆయన
అన్నారు.ప్రత్యేక
తెలంగాణా
వచ్చే
లోపు
చంద్ర
శేఖరరావు
సమాంతర
అసెంబ్లీలను
నిర్వహించి,
సంఖ్యాధిక్యత
గల
వర్గాలకు
ప్రాధాన్యం
ఇవ్వాలని
సూచించారు.