వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రశాంత్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ
గుంతకల్లుఃవిశాఖపట్నం నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రశాంతిఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గుంతకల్లు-ద్రోణాచలంరైలు మార్గంలో తగ్గిలి-మద్దెకెర స్టేషన్ల మధ్య గురువారం అర్థరాత్రి దాటిన తరువాత దోపిడీ దొంగలు రెండు బోగీల్లో బీభ్తసం సృష్టించారు.
మొదట చెయిన్ లాగి రైలు ఆపివేశారు. ఆ తరువాత ఎస్-7 కోచ్ లో నిద్రిస్తున్నవిశాఖపట్నం కు చెందిన లక్ష్మి మెడలో గొలుసు లాక్కున్నారు. ఆ తరువాత ద్రోణాచలం కు చెందిన మదిరమ్మ మెడలో రెండు తులాల గొలుసు కూడా లాక్కున్నారు. మహిళలుపెద్దగా అరవడంతో రైలులో వున్న ఎస్కార్ట్ పోలీసులు అక్కడికి వచ్చేలోగా దుండగులు పారిపోయారు. అన్నిఎక్స్ ప్రెస్ రైళ్ళలో మొబైల్ పోలీస్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం ధరిస్తే తప్ప ఆంధ్ర లో ఈరైళ్ళ దోపిడీలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదు.
Story first published: Saturday, May 19, 2001, 23:53 [IST]