త్వరలో తెలంగాణాపై ఎఐసిసి నిర్ణయం
హైదరాబాద్ : తెలంగాణాపై త్వరలో ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణా ఎమ్మెల్యేల ఫోరం నాయకుడు ఇద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు హామీ ఇచ్చనట్టు ఆయన శనివారం నాడు హైదరాబాద్లో విలేకరులకు చెప్పారు. ఇటీవల తెలంగాణా ఎమ్మెల్యేల ఫోరం ప్రతినిధులు సోనియా గాంధీని కలిసి ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ఆమెకు వివరించినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాకు న్యాయం జరిగే ప్రశ్నే లేదనితాము సోనియాకు వివరించామన్నారు. అధిష్టానవర్గం తమ డిమాండ్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. వచ్చే నెల 16,17 తేదీల్లో మరోసారి తాము సోనియా గాంధీని కలువనున్నట్టుగా ఆయన వెల్లడించారు.
తెలంగాణా
ఫోరం
ప్రత్యేక
తెలంగాణ
విషయంలో
తగిన
చొరవ
తీసుకోవడం
లేదని
సిరిసిల్లా
ఎమ్మెల్యే
పాపారావు
చేసిన
విమర్శను
ఆయన
ఖండించారు.
తెలంగాణ
సాధనకు
టిఆర్ఎస్
నేత
చంద్రశేఖర్రావు
ఇప్పుడు
చేస్తున్న
ప్రయత్నాలను
తాము
ఆరునెలల
క్రితమే
ప్రారంభించామని
ఆయన
చెప్పారు.
అయితే
ముఖ్యమంత్రి
చంద్రబాబు
తెలంగాణా
రాష్ట్ర
సాధనకు
ప్రధాన
అడ్డంకిగా
వున్నారని
ఆయన
ఆరోపించారు.
కేంద్రంలోని
ఎన్డిఎ
ప్రభుత్వం
తెలుగుదేశం
పార్టీ
మద్దతుపై
ఆధారపడి
వుండటంతో
తెలంగాణా
విషయంలో
కేంద్రం
సానుకూలంగా
స్పందించకుండా
చంద్రబాబు
బ్లాక్మెయిల్
చేస్తున్నారని
ఆయన
ఆరోపించారు.