వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడలో అమ్మాయిలతో వ్యాపారం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః ఉపాథి కల్పిస్తామంటూ నమ్మబలికి, అమాయకులైన యువతులను ముంబయ్‌ వ్యభిచార గృహాలకు అమ్ముతున్న ముఠాను విజవాడ పోలీసులుఅరెస్టు చేశారు. ఈ ముఠా వలలో చిక్కి, ముంబయ్‌ వ్యభిచార కూపంలో పడి, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన ఇద్దరు యువతులు ఇచ్చిన సమాచారంతో ఈ ముఠా గుట్టురట్టయింది. ఇద్దరు మైనర్‌ బాలికలను ముంబయ్‌ వ్యభిచార గృహాలకు తరలించేందుకు ఏర్పాటు చేసుకుంటున్న యువతులను అమ్మే ముఠాలోని ఐదుగురు మహిళలను నున్న పోలీసులు గురువారం రాత్రిఅరెస్టు చేశారు.

విశాఖపట్నంకు చెందిన 22 ఏళ్ళ పద్మ కొద్ది రోజుల కిందటవిజయవాడ పారిపోయి వచ్చింది. రిక్షాకార్మికుడు ఆమె వాలకాన్ని గమనించి మాయ మాటలు చెప్పి రాజీవ్‌ నగర్‌ లోని తిరుపతమ్మకు అప్పగించాడు. తిరుపతమ్మ రెండు రోజులు పద్మను బాగా చూసుకుంది. ఆ తరువాత పద్మను 40 వేలకు ముంబయ్‌ వ్యభిచార గృహానికి అమ్మేసింది. వారు పద్మను నానా విధాలుగా హింసపెట్టి నెలకు ఆరువేల రూపాయలు ఇస్తామని చెప్పి వ్యభిచారంలోకి దించారు. అక్కడ పరిచయంఅయిన చిన్ని అనే 18 ఏళ్ళ మరో తెలుగు అమ్మాయితో కలిసి పద్మవిజయవాడ పారిపోయి వచ్చింది.
విజయవాడ రాగానే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్న ముఠానుఅరెస్టు చేశారు.

చిన్ని నికూడా తిరుపతమ్మ ముఠా మాయమాటలు చెప్పి ముంబయ్‌ లో అమ్మేసింది. ఈ విధంగా చాలా మంది యువతులను ఈ ముఠా బలవంతంగా వ్యభిచారిణులుగా మార్చుతున్నది.విజయవాడలో పకడ్బందీగా జరుగుతున్న ఈ వ్యవహారం పోలీసులకు తెలియకపోవడం, తెలిసినా చర్య తీసుకోకపోవడం నిజంగా విడ్డూరమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X