ఎన్నికల ప్రభావం బిజెపి పై లేదు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పనితీరును సమీక్షించేందుకు బిజెపి జాతీయ కార్యవర్గం రెండు రోజుల సమావేశాలు ఉత్తరాంచల్లోని ముస్సోరిలో ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో పరాజయానికి కారణాలను విశ్లేషించడంతో పాటు ఈ ఫలితాల ప్రభావం పార్టీ పై ఏవిధంగా వున్నదనే అంశంపై కూడా సమవేశంలో చర్చిస్తున్నారు.
ఈ
ఎన్నికల
ఫలితాల
వల్ల
తమ
పార్టీకి
ఇసుమంత
కూడా
నష్టం
జరగలేదని
బిజెపి
అధ్యక్షుడు
జనా
కృష్ణమూర్తి
స్పష్టం
చేశారు.
త్వరలో
జరుగనున్న
ఉత్తరప్రదేశ్
అసెంబ్లీ
ఎన్నికలు
అసలు
సవాలని
కాంగ్రెస్
పార్టీకి
చేతనైతే
తమను
ఆ
ఎన్నికల్లో
ఎదుర్కోవాలని
ఆయన
సవాలు
విసిరారు.
జమ్మూకాశ్మీర్,
ఉత్తరప్రదేశ్,
పంజాబ్
అసెంబ్లీ
ఎన్నికలకు
సంబంధించి
ఇప్పటినుంచే
అనుసరించాల్సిన
వ్యూహాలపై
కూడా
ఈ
సమావేశం
చర్చిస్తున్నది.
కేంద్ర
హోమంత్రి
అద్వానీ
ఈ
సమావేశానికి
హాజరవుతున్నారు.
ఇదిలా
వుండగా
మణిపూర్లో
కోయిజమ్
ప్రభుత్వానికి
మద్దతు
నిచ్చే
విషయంలో
సమతాపార్టీ
నుంచి
వస్తున్న
వత్తిడులకు
బిజెపి
తలవొగ్గింది.
సోమవారం
నాడు
జరుగనున్న
బలపరీక్షలో
కోయిజమ్
ప్రభుత్వానికి
మద్దతు
నివ్వాలని
బిజెపి
నాయకులు
నిర్ణయించారు.