సిడిఎస్కు అడ్మిరల్తిరస్కారం
న్యూఢిల్లీ:చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకంలో జరుగుతున్నజాప్యం ఈ విషయంలో ప్రభుత్వం వైఖరికి పూటకోతీరు మారుతుండటంతో ప్రతిష్టాత్మకమైనఈ పదవికి తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించవద్దనికోరుతూ, నావిక దళాల ప్రధానాధిపతి అడ్మిరల్సుశిల్కుమార్ ప్రభుత్వానికి లేఖరాశారు.
ప్రభుత్వంతొలుత సిడిఎస్ పదవిని ఏర్పాటు చేసి త్రివిధదళాల మధ్య సమన్వయానికి వేదికగా ఉపయోగించుకోవాలనినిర్ణయించిన విషయం విదితమే. త్రివిధ దళాధిపతుల్లోసీనియర్ అయిన అడ్మిరల్ సుశిల్ కుమార్ పేరు సహజంగాఈ కొత్త పదవికి పరిగణలోకి తీసుకున్నారు.
అన్ని పత్రికల్లో,ప్రసారసాధనాల్లో ఈ విషయం ప్రముఖంగా వచ్చింది.ఎంతగానో ప్రచారం జరిగిన తర్వాత ఈ కొత్త పదవిఏర్పాటు ప్రతిపాదనను రక్షణ వ్యవహారాలకేబినెట్ కమిటి తిరస్కరించింది. ఈ పరిణామాలతోఖిన్నుడైన అడ్మిరల్ అసలు ఆ పదవిని ప్రభుత్వంసృష్టించినా తన పేరును మాత్రం పరిగణలోకితీసుకోవద్దని కోరారు.